కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో కల్యాణలక్ష్మి చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమం జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే చేయాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల ఆయన హాజరు కాలేదు.
దాంతో ఎంపిపి యశోదా నీళ్లు పటేల్, జడ్పిటిసి లక్ష్మీబాయి దాదారావు పటేల్, ఆత్మ కమిటీ చైర్మన్ సాయాగౌడ్, చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొల్ల హనుమాన్లు, వైస్ ఎంపిపి ఉమాకాంత్ ,సొసైటి చైర్మన్ శివానంద్ గ్రామపెద్దలు షబ్బీర్ శంకర్ పటేల్, విట్టల్రావు, పార్టీ గ్రామ అధ్యక్షులు విశ్వనాథ్ ఉన్నారు.