బిచ్కుంద మండల కేంద్రంలోని ఎంపిపి కార్యాలయంలో ఎల్లారం గ్రామానికి చెందిన నలుగురు లబ్ధిదారులకు ఎంపిపి అశోక్ పటేల్ కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరు పేద కుటుంబాలకు అండగా కేసీఆర్ ఏనో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అందులో ప్రధానమైనది కల్యాణలక్ష్మి పథకమన్నారు.
నిరుపేద కుటుంబంలో కూడా తమ ఆడపిల్లలకు గౌరవంగా పెళ్లిళ్లు చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపితో పాటు తెరాస అధ్యక్షుడు వెంకట్రావు దేశాయి, మాజీ జడ్పీటిసి సాయిరాం, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు ఆరెస్సెస్ అధ్యక్షులు బస్వరాజ్ పటేల్, ఎల్లారం గ్రామ సర్పంచ్ సంగ్రా౦, రెవిన్యూ అధికారి రాచప్ప, దేవాడ భీమన్న, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.