42.2 C
Hyderabad
May 3, 2024 15: 10 PM
Slider ఆధ్యాత్మికం

ఈ సారి వైభ‌వంగా శ్రీరామ‌న‌వ‌మి మ‌హోత్స‌వాలు

#bhadradritemple

ప్రసిద్ధ పుణ్య‌క్షేత్రం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి క‌ళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా  నిర్వ‌హిస్తామ‌ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. సీయం కేసీఆర్ ఆదేశాల మేర‌కు  ఎప్రిల్ 10న శ్రీరామనవమిని పురస్కరించుకుని కళ్యాణోత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులను అనుమతించనున్నట్లు పేర్కొన్నారు.  కళ్యాణ మహోత్సవం నిర్వహించే మిథిలా స్టేడియాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దాల‌ని దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ కు ఆదేశాలు జారీ చేశారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాల‌న్నారు. ఆలయ పరిసరాల్లో వెదురు తడికలతో కూడిన చలువ పందిళ్లను నిర్మించాల‌న్నారు. మ‌రోవైపు ఏప్రిల్‌ 2న శుభకృత్‌ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ప్ర‌భుత్వ ఆద్వ‌ర్యంలో పంచాంగ శ్రవణం కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లుదేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు.

గత రెండు సంవత్సరాలు కొవిడ్‌ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలోనే కోవిడ్ నిబంధనలతో శ్రీరాముని కళ్యాణ వేడుకల‌ను,  నిరాడంబ‌రంగా పంచాంగ శ్రవ‌ణ కార్య‌క్ర‌మాలను నిర్వ‌హించామ‌ని,  ప్రస్తుతం మహమ్మారి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కనులపండువలా భక్తుల సమక్షంలో నిర్వహించనున్న‌ట్లు వెల్ల‌డించారు.

Related posts

సిఎం జగన్ వ్యాఖ్యలపై ఎలాంటి స్పందన వద్దు

Satyam NEWS

జంట హత్యల కేసును సిబిఐకి అప్పగించాలి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Satyam NEWS

వైసీపీ కి కష్ట కాలం: టీడీపీలో చేరడానికి క్యూ

Satyam NEWS

Leave a Comment