29.7 C
Hyderabad
May 1, 2024 06: 11 AM
Slider ఆధ్యాత్మికం

ఇంద్ర‌కీలాద్రిపై గాయ‌త్రీదేవిగా దుర్గ‌మ్మ సాక్షాత్కారం

#kakadurga

శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా రెండో రోజైన సోమ‌వారం (ఆశ్వ‌యుజ శుద్ధ విదియ‌) నాడు విజయవాడ ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ గాయ‌త్రీదేవిగా సాక్షాత్క‌రించింది. వేద‌మాత‌గా ప్ర‌సిద్ధి పొందిన ఈ త‌ల్లి … ముక్తా, విద్రుమ‌, హేమ‌, నీల‌, ధ‌వ‌ళ వ‌ర్ణాల‌తో ప్ర‌కాశిస్తూ భ‌క్తుల‌ను అనుగ్ర‌హించింది. పంచ ముఖాల‌తో ద‌ర్శ‌న‌మిచ్చే సంధ్యావంద‌న అధిష్టాన దేవ‌త అయిన గాయ‌త్రీదేవిని పూజిస్తే స‌క‌ల ఉప‌ద్ర‌వాలూ తొల‌గుతాయ‌నీ, బుద్ధి తేజోవంతం అవుతుంద‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. ఈ రోజున వంగ‌, ఆకుప‌చ్చ‌, బంగారు వ‌న్నెల చీర‌ల్లో కొలువుదీరిన అమ్మ‌వారికి నైవేద్యంగా పులిహోర‌, కేస‌రి, పుల‌గాల‌ను స‌మ‌ర్పించారు. సమస్త దేవతా మంత్రాలకీ గాయత్రీ మంత్రంతో అనుబంధం ఉంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే ఆయా దేవతలకు అన్నాదులు, ప్రసాదాలు నివేదన చేశారు.

Related posts

గుంటూరు జిల్లాలో ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్టు

Satyam NEWS

తొలి తెలుగు పాన్‌ ఇండియా బాలల చిత్రం ‘లిల్లీ’ ఫస్ట్ లుక్

Satyam NEWS

బిగ్ మిస్టేక్:కాంగ్రెస్ పార్టీని వీడేది కాకుండే

Satyam NEWS

Leave a Comment