కంగెన్ వాటర్ తో శరీరానికి అధిక ప్రయోజనాలు కలుగుతాయని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శనివారం రాయచోటిలోని కోవిడ్ కేర్ సెంటర్ లో జిన్నా సేవా సంస్థ ఆధ్వర్యంలో కోవిడ్ బాధితులకు కంగెన్ వాటర్ బాటిళ్ల సరఫరా ప్రారంభ కార్యక్రమంలో ఎం ఎల్ సి జకియా ఖానం తో కలసి ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కంగెన్ వాటర్ శరీరంలోని వ్యర్థ , విషతుల్యాలును తొలగిస్తుందన్నారు. శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తిని అత్యధిక స్థాయిలో అందిస్తుందన్నారు. ఒక లీటర్ కంగెన్ వాటర్ వంద ఆపిల్స్ కు సమానమన్నారు.
కరోనా బాధితులకు కంగెన్ వాటర్ మంచి శక్తిని ఇస్తుందన్నారు. జిన్నా సేవా సంస్థ ఆధ్వర్యంలో తరచూ సేవా కార్యక్రమాలు చేపట్టడం ప్రశంసనీయమన్నారు. రూ 5 లక్షల వ్యయంతో కంగెన్ వాటర్ సరఫరా చేయడం అభినందనీయమని , ఈ సందర్భంగా జిన్నా సేవా సంస్థ వ్యవస్థాపకుడు జిన్నా షరీఫ్ ను శ్రీకాంత్ రెడ్డి అభినందించారు. కోవిడ్ కేర్ సెంటర్ లోని బాధితులకు 2 లీటర్ల చొప్పున రోజూ అందచేస్తామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.