మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ డాక్టర్ ఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం రాత్రి ఘనంగా జరిగాయి. పలువురు ప్రముఖులు, కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి కి పుష్పగుచ్ఛాలు అందించి శాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు స్వర్ణరాజు శివమణి, మందమల్ల రజిత పరమేశ్వర్ రెడ్డి, దమ్మాయిగూడ కౌన్సిలర్లు గోగుల సరిత ముప్పు శ్రీలత, వరగంటి వెంకటేష్, దమ్మాయిగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పు రామారావు, నాయకులు నీరుకొండ సతీష్ బాబు, ఎస్ ఏ. రహీం, రేగళ్ల సతీష్ రెడ్డి, మచ్చ పాండు, బిశ్వజిత్ రాయి, శోభారెడ్డి, యార్లగడ్డ దుర్గ, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు కల్పనా రెడ్డి, మెరుగు సునీత, పద్మ, జలీల్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి