ములుగు మండల కేంద్రానికి సమీపంలోని గ్రామంలో బాల్య వివాహంపై సమాచారం అందుకున్న జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారి ఓంకార్ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళి వాకబు చేశారు. ఈ నేపథ్యంలో బాల్యవివాహంపై జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం వారి వారికి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ చేశారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని దీని ప్రకారం తల్లిదండ్రులు శిక్షార్హులన్నారు. అలాగే బాల్య వివాహా ఏర్పాట్లకు హజరైన వారిని కూడా హెచ్చరించారు.
అనంతరం ఇరు కుటుంబాల నుండి బాల్యవివాహం చేయమనే హామీపత్రాన్ని తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజయ్య, ఐసీపీఎస్ జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్, సోషల్ వర్కర్ జ్యోతి, సఖి టీమ్ కౌన్సిలర్, కల్పన, పోలీస్ కానిస్టేబుల్స్ సాజిత్, బిక్షపతి, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ ప్రభ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.