26.7 C
Hyderabad
April 27, 2024 07: 38 AM
Slider విశాఖపట్నం

హాజరత్ బాబా నడియాడిన స్థల దర్శన భాగ్యం కలగడం అదృష్టం

#hazratbaba

విజయనగరం జిల్లా కేంద్రం బాబామెట్ట లో వేంచేసిన హజరత్ ఖాదర్ బాబా అవలియా 63 సుగంధ ఉత్సవాలకు రావడం అదృష్టం గా భావిస్తున్నానని  విశాఖ రేంజ్ ఐజీ రంగారావు అన్నారు. నగరంలో ని బాబామెట్ట లో బాబా వారి దర్గా లో మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భాగంగా రెండో రోజు న దర్గా ను సందర్శించారు…రేంజ్ ఐజీ రంగారావు. ఈ సందర్భంగా దర్గా లో ప్రతీ రోజు వేలాది మందికి జరుగుతున్న అన్నదాన కార్యమాన్ని ఐజీ రంగారావు ప్రతిపక్షంగా పరిశీలించారు.

అలాగే దర్గా లో బాబా సమాధిని..అదే విధంగా వృద్ధాశ్రమం..అన్నార్తులకు సేవలు వంటి కార్యక్రమాలను రేంజ్ ఐజీ రంగారావు.. ఎస్పీ దీపికా ఏఎస్పీ అనిల్ తో పరిశీలించారు.అనంతరం ఐజీ మాట్లాడుతూ.. హజరత్ ఖాదర్ బాబా అవలియా స్థలంలో అడుగు పెట్టడం ఆనందంగా ఉందన్నారు.బాబా వారి ఆశయాలు ప్రజలందరూ ఆచరించాలన్నారు.ప్రేమ పంచడం తో అనురాగాలను బాబా వారు అందించారన్నారు.అనంతరం…ఆశ్రమానికి వచ్చిన వాళ్లందరికీ రేంజ్ ఐజీ అన్న ప్రసాదాన్ని స్వయంగా వడ్డించారు.

ఐజీతో పాటు ఎస్పీ ,ఏఎస్పీ లు కూడా వడ్డించి సమభావాన్ని చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ మోహన్ రావు ,ఎస్బీ సీఐ రాంబాబు, టూటౌన్ సీఐలు లక్ష్మణరావు,మంగవేణి, ఎస్ఐలు సాగర్ బాబు,నారాయణ, ట్రాఫిక్ ఎస్ఐ భాస్కరరావు లు ఉన్నారు.

Related posts

మూసీ వరద ప్రాంతాలను సందర్శించిన బీజేపీ నేతలు

Bhavani

కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం కు డీకే మాదిగ సవాల్

Satyam NEWS

టికానా లేనోళ్లం

Satyam NEWS

Leave a Comment