ఈ నెల 9,10,11 ఈ మూడు తేదీలలో జిల్లా అధికారులకు ముఖ్యంగా దేవాదాయ శాఖతో పాటు పోలీసులకు కంటిమీద కు నుకు లేకుండా ఉండసాగనుంది.మరీ ముఖ్యంగా పోలీసు శాఖ..అహర్నిశలు అటు ఉత్సవాలు.. ఇటు సిరిమాను పండగల పైన మరింత గా దృష్టి పెట్టాల్సింది. ఈ క్రమంలో నే జిల్లా ఎస్పీ దీపికా… విజయనగరం సబ్ డివిజన్ సిబ్బంది తో సంబంధిత ప్రదేశాలను పరిశీలించారు.
ఈ నెల 9న జరగబోవు విజయనగరం ఉత్సవాలు, 10, 11న జరగబోవు శ్రీ పైడితల్లి అమ్మవారి తోలేళ్లు, సిరిమానోత్సవం బందోబస్తు, భద్రత ఏర్పాట్లు పర్యవేక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక, అయోధ్య మైదానం, హుకుంపేట, కోట, మూడు లాంతర్లు, ఆలయ ప్రాంతాలను సందర్శించి, అధికారులకు పలు భద్రతా పరమైన సూచనలు చేశారు..జిల్లా ఎస్పీ వెంట విజయనగరం డిఎస్పీ టి.త్రినాథ్, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, సిఐలు బి.వెంకటరావు, జి.రాంబాబు మరియు ఇతర అధికారులు ఉన్నారు