యువగళం పాదయాత్ర సందర్భంగా కావలి పట్టణం జనసంద్రంగా మారింది. కావలి పురవీధుల్లో యువనేత లోకేష్ పాదయాత్రకు జనం వెల్లువెత్తారు. భారీగా తరలివచ్చిన ప్రజానీకంతో పట్టణ కావలి వీధులన్నీ కిటకిటలాడాయి.
జనప్రవాహాన్ని తలపిస్తున్న కావలి వీధులలో, లోకేష్ చూసేందుకు జనం డాబాలపైకి ఎక్కారు. యువనేత లోకేష్ పై ఉప్పొంగిన అభిమానంతో ప్రజలు గజమాలలతో ఘనసత్కారం అందించారు. అడుగడుగునా యువనేతకు మహిళలు, యువకులు నీరాజనం పలికారు.
దారిపొడవునా డప్పుల చప్పుడు, బాణాసంచా మోతలతో కార్యకర్తల కేరింతల మధ్య లోకేష్ పాదయాత్ర సాగింది. యువనేత లోకేష్ తో సెల్ఫీల కోసం యువతీయువకులు పోటీపడుతున్నారు. కావలి ప్రజానీకం లోకేష్ ను కలసి సమస్యలను విన్నవించుకుంటున్నారు. మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలు పరిష్కరిస్తుందని లోకేష్ వారికి భరోసా ఇస్తున్నారు.