ప్రమాద వశాత్తు చెరువు లో పడిన కుమారుణ్ణి కాపాడ బోయి ఆ తండ్రి కుడా మృతిచెందిన సంఘటన ఇది.బట్టలుతకడానికి చెరువు కు వెళ్లిన తండ్రి కొడుకులు ఆ చెరువులోనే పడి మృతి చెందిన ఘటన తో కారేపల్లి మండలం గుంపెల్లగూడెంలో విషాదం నెలకొంది.పోలీస్ ల కథన ప్రకారం బట్టలు ఉతికేందుకు తండ్రి తో కలిసి కుమారుడు చెరువులోకి వెళ్లాడు. బట్టలను జాడిస్తూ పిల్లాడు ప్రమాదవశాత్తు చెరువులో పడిపోవడంతో అతడిని కాపాడే ప్రయత్నంలో తండ్రి కూడా మునిగిపోయాడు.దీని తో తండ్రీకుమారుడు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతులను సత్యనారాయణ(48), భరత్(14)గా పోలీసులు గుర్తించారు. మృతుల నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
previous post