సామూహిక వివాహాలు చేసుకుంటున్న వధూవరులకు సిర్పూర్ నియోజక MLA కోనేరు కొనప్ప దంపతులు పట్టువస్త్రాలు పంపిణీ చేశారు. బెజ్జూర్ మండల కేంద్రంలో నేడు జరిగిన ఈ కార్యక్రమంలో పట్టువస్త్రాలు అందుకున్న జంటలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సిర్పూర్ నియోజక MLA కోనేరు కొనప్ప దంపతులు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బెజ్జూర్ మండల రైసస అధ్యక్షులు అర్షద్ హుస్సేన్, ఎంపీపీ డోకే రోజా రమణి వెంకన్న, జడ్పీటీసీ పంద్రం పుష్పాలత భిక్షమయ్య, మండల కో ఆప్షన్ సభ్యులు బాషరత్ ఖాన్, మండల తెరాస పార్టీ యూత్ అధ్యక్షులు తెలంగాణ జావిద్, మండల ఎంపీటీసీ లు, సర్పంచ్ లు, తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.