29.7 C
Hyderabad
May 1, 2024 07: 44 AM
Slider గుంటూరు

ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన

#kolatam

పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం స్థానిక పడమటి పాలెంలో శనివారం రాత్రి మహిళలు ప్రదర్శించిన కోలాట ప్రదర్శన  గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకుంది. రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ మాజీ  చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 40 మంది మహిళలు కోలాటం నేర్చుకుని ప్రదర్శించారు. గ్రామానికి విచ్చేసిన నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవిందబాబు కోలాట ప్రదర్శనను ఆసక్తికరంగా తిలకించారు.

ఈ సందర్భంగా డా౹౹చదలవాడ మాట్లాడుతూ ప్రాచీన కళలు అంతరించిపోతున్న ఈ తరుణంలో కోలాటం వంటి కళను ప్రదర్శించుట అభినందనీయమని అన్నారు. ఇటువంటి ప్రాచీన కళలు గ్రామాల్లో సమైక్యతకు దోహదపడతాయని అన్నారు. ఈ సందర్భంగా కోలాటం ప్రదర్శించిన మహిళలను,నిర్వాహకులను ఆయన అభినందించారు.

అనంతరం కోలాటం ప్రదర్శించిన మహిళలు డా౹౹చదలవాడను,గోనుగుంట్ల కోటేశ్వరరావును ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు వెన్నా బాలకోటిరెడ్డి,మండల కార్యదర్శి పులుకూరి జగ్గయ్య,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మెట్టు వెంకటేశ్వరరెడ్డి,మాజీ ఎంపీపీ మొండితోక రామారావు,కోనేటి శ్రీనివాసరావు,నెల్లూరి శ్రీనివాసరావు, మామిళ్ళపల్లి ఆదిబాబు,మాదినీడి అంజయ్య,పల్లెల అంజిరెడ్డి,కల్లి మల్లారెడ్డి,ముండ్రు శివకోటి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎయిమ్స్ లో భారీ అగ్ని ప్రమాదం

Satyam NEWS

క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే కేర్ సెంట‌ర్ల‌కు త‌ర‌లించండి

Satyam NEWS

ఎన్టీఆర్‌ జీవితాన్ని పాఠ్యాంశంగా తేవాలి : నందమూరి బాల కృష్ణ

Satyam NEWS

Leave a Comment