తెదేపా వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవితచరిత్రను పాఠ్యాంశంగా తీసుకురావాలని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన నివాళులర్పించారు.
అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ యుగపురుషుడు, పేదల పెన్నిదని కొనియాడారు. తన తండ్రి సినిమాలు చూసి స్ఫూర్తి పొందానని చెప్పారు.
ఎన్టీఆర్పై ఎంతో మంది పుస్తకాలు రాశారని.. అయితే ఆయన జీవిత చరిత్రను విద్యార్థులకు పాఠ్యాంశంగా అందుబాటులోకి తీసుకురావాలని తాను ఎప్పటి నుంచో కోరుతున్నట్లు గుర్తు చేశారు.
ఇప్పటికీ తాను అదే డిమాండ్ చేస్తున్నానన్నారు.