సౌమ్యుడు,నిజాయితీపరుడైన రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి ని నాగిరెడ్డిపల్లె మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్ విమర్శిస్తే చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ హెచ్చరించారు. శనివారం ఆర్ అండ్ బి బంగ్లా ఆవరణంలో వైసిపి నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వైసిపి నాయకులు ధనుంజయ నాయుడు, హిమగిరి నాథ్ యాదవ్, ఉప మండల అధ్యక్షులు అనుదీప్ తదితరులు మాట్లాడుతూ సమ్మెట శివ ప్రసాద్ కు రాజకీయ భిక్ష పెట్టింది మేడ కుటుంబమని, వారి వల్లనే పంచాయతీలో, మండలంలో నీవెవరో ప్రజలకు తెలుసని అలాంటిది స్థాయిని మరిచి ఎమ్మెల్యే విమర్శించడం సరికాదన్నారు.
అన్నమయ్య వరదల్లో నష్టపోయిన బాధితులకు కోట్ల రూపాయల సొంత నిధులతో బాధితులను ఆదుకున్న కుటుంబం మేడ కుటుంబమని అటువంటి వారిపై మరొకసారి స్థాయిని మరిచి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు జిల్లా వైసిపి మైనార్టీ కార్యదర్శి సయ్యద్ అమీర్, రాష్ట్ర యువజన కార్యదర్శి నడివీధి సుధాకర్, ఉప మండల అధ్యక్షురాలు తుమ్మల భావన శ్రీధర్, మండల కో ఆప్షన్ సభ్యులు కలీం, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.