28.7 C
Hyderabad
April 26, 2024 10: 58 AM
Slider కరీంనగర్

యానిమల్ వెల్ఫేర్: పశు సంపద పెంచేందుకు చర్యలు

huzurabad 1

వారం రోజుల పాటు గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టాల నివరణ మందులు ఇస్తామని కరీంనగర్ జిల్లా పశు వైద్య, పశుసంవర్ధకాధికారి డాక్టర్ వి. అశోక్ కుమార్ తెలిపారు. నేడు చెల్పూర్ గ్రామంలో గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ మందులు త్రాగించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పశు సంపద పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నదని అందులో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన తెలిపారు. ప్రతి ఊరిలో ఈ కార్యక్రమం చేపడతామని అందువల్ల  గొర్రెల కాపరులు ఈ అవకాశం సద్వినియోగంచేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వి. అశోక్ కుమార్ తో బాటు గ్రామ సర్పంచ్ నెరేళ్ల మహేందర్ గౌడ్ పాల్గొన్నారు.

ఇంకా ప్రాధమిక గొర్రెల, మేకల పెంపకదారుల సహకార సంఘం అధ్యక్షుడు మండల సాయిబాబా, పశువైద్య అధికారి డాక్టర్ ఎల్ వీరేశం, జూనియర్ పశువైద్యాధికారి జె. శ్రీనివాస్, ఆఫీస్ సహాయకులు ఎస్ ధర్మరాజు, నట్టాల నివరణ వితరణ సహాయకులు వాజిద్, యాదవ కుల పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

ఒంగోలు సభ చూసి డిప్రెషన్ లోకి వెళ్లొద్దు

Satyam NEWS

విద్యలనగరంలో తళుక్కుమన్న తమన్నా…!

Satyam NEWS

బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల..!

Satyam NEWS

Leave a Comment