ముఖ్యమంత్రి సహాయనిధికి కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తల్లి బిచ్చమ్మ లక్ష రూపాయలు విరాళం ఇచ్చారు. నాగర్ కర్నూల్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నాగర్ కర్నూల్ కలెక్టర్ శ్రీధర్ నేడు ఈ చెక్కును అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి భార్య విజయమ్మ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీరం విజయమ్మ మాట్లాడుతూ కరోనా ప్రపంచ విపత్తు అని మనం అందరు కలిసి కట్టుగా ఉంటేనే దీనిని ఎదుర్కోగలమని అన్నారు.
ఇప్పటికే ఎమ్మెల్యే తన నెల గౌరవ వేతనం రూ. 2.50లక్షలు, అభివృద్ధి నిధులు రూ.3కోట్లను అందించారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే చేస్తున్న సామాజిక సేవలో తామూ భాగం పంచుకొంటూ ఈ చిరుసాయం చేస్తున్నామని ఆమె అన్నారు.-ఈ సందర్భంగా వారిని కలెక్టర్ శ్రీధర్ అభినందించారు.
ఇదే స్ఫూర్తితో అందరూ ముందుకు వచ్చి సహాయం అందించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మను చౌదరి, జగన్మోహన్ రెడ్డి, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.