కరోనా వ్యాప్తి నేపథ్యంలో అహర్నిశలూ కష్టపడుతున్న మునిసిపల్ కార్మికులను నేడు నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, ఏ వన్ కాంట్రాక్టర్ జగన్మోహన్ రెడ్డి తదితరుల పాల్గొన్నారు.
బుధవారం నాడు నిర్మల్ పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయం లో కార్మికుల కు పులిహోర వాటర్ ప్యాకెట్ లను అందజేశారు. కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా మీరంతా పట్టణంలో అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఆయన అన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు కూడా ఎవరూ గుంపులు గుంపులుగా ఉండ రాదని ఆయన కోరారు.
లాక్ డౌన్ చేయడం వల్ల ఈ వ్యాధిని అరికట్టవచ్చుని తెలిపారు. ఈ కార్యక్రమంలో జైపాల్ రెడ్డి, 40 వ వార్డు కౌన్సిలర్ అడప విజయలక్ష్మి పోశెట్టి, 14వ వార్డు కౌన్సిలర్ మతిన్, 7వ వార్డు కౌన్సిలర్ అబ్రార్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.