40.2 C
Hyderabad
May 1, 2024 18: 07 PM
Slider మహబూబ్ నగర్

అనారోగ్యంతో మరణించిన కుటుంబానికి కౌన్సిలర్ అండ

#kollapurmunicipality

అనారోగ్యంతో మరణించిన వారి కుటుంబానికి పెద్ద మనసుతో సాయం చేశారు కొల్లాపూర్ మునిసిపల్ కౌన్సిలర్. వివరాలలోకి వెళితే నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని 10 వ వార్డ్ కి చెందిన బైర్ కమ్మరి నిరంజన్ శుక్రవారం అనారోగ్యంతో మరణించారు.

విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు  ప్రధాన అనుచరుడు స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ షేక్ రహీం పాషా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. బైర్కమ్మరి నిరంజన్ కుటుంబ సభ్యులకు మున్సిపల్ కౌన్సిలర్ షేక్ రహీం పాషా 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. వారి కుటుంబానికి కౌన్సిలర్  తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి ఎల్లవేళలా అండగా ఉంటామని మనో ధైర్యం కల్పించారు.

Related posts

వ్యాక్సిన్ రాలేదు కాబట్టి ముందు జాగ్రత్తలే ముఖ్యం

Satyam NEWS

జూమ్ యాప్ ఆన్ లైన్ క్లాసులు బాలికలకు ప్రమాదం

Satyam NEWS

విజయవాడలో కాలభైరవస్వామి విగ్రహ ప్రతిష్ట

Satyam NEWS

Leave a Comment