కొల్లాపూర్ పట్టణంలోని ప్రధాన వీధుల్లో సోడియం హైపో క్లోరైడ్ మందు నీళ్లలో కలిపి స్ప్రే చేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నేడు పర్యవేక్షించారు. కొల్లాపూర్ పట్టణ వీధుల్లో కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి నివారణకై ముందస్తు జాగ్రత్తగా సోడియం హైపో క్లోరైడ్ మందును నీళ్లలో కలిపి అగ్నిమాపక వాహనం, సిబ్బంది సాయంతో స్ప్రే చేయించారు.
ప్రజలందరూ లాక్ డౌన్ కు సహకరించి అధికారులు నిర్దేశించిన నిబంధనలను పాటించి ఇంటి వద్దనే ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు. ఉదయం మాత్రమే అవసరమైన నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవాలని, సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరూ రోడ్ల మీదకు రావొద్దని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
పట్టణంలో పారిశుద్ధ్య పనులకు ఆటంకం కలగవద్దని, పారిశుద్ధ్య విధుల్లో పాల్గొనే వారికి మాస్కులు, గ్లౌసులు తప్పకుండా ఇవ్వాలని, ఎప్పటికప్పుడు మున్సిపల్ కమిషనర్, చైర్మన్, కౌన్సిలర్లు శానిటరీ పనులను పర్యవేక్షించాలని సూచించారు.