జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం తిరుమలగిరి గ్రామపంచాయతీ సమీపంలోని అటవీ ప్రాంతం నుండి వేటకుక్కలు కొండ గొర్రె ను వేటాడాయి.ఈ విషయాన్ని స్థానికులు అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు.. దీంతో ఆ ప్రాంతానికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప్రసాదరావు, బీట్ ఆఫీసర్ మహమ్మద్ ఫయాజ్ అహ్మద్ చేరుకొని కొండ గొర్రె ను పరిశీలించారు.
మరుసటి రోజు అనగా ఈ రోజు నాడు రేగొండ వెటర్నరీ డాక్టర్ మైతిలి తో పోస్టుమార్టం చేయించారు. అనంతరం ఖననం చేశారు.ఈ కార్యక్రమాలలో భాగంగా రేగొండ వెటర్నరీ డాక్టర్ మైతిలి , ఎఫ్.ఆర్.ఓ కోటేశ్వర్ రావు , ఎఫ్.ఎస్.ఓ ప్రసాద్ రావు ,ఎఫ్.బి.ఓ మహమ్మద్ ఫయాజ్ అహ్మద్ , పాండవుల గుట్ట వద్ద ఉన్న అటవీ సిబ్బంది పాల్గొన్నారు.