40.2 C
Hyderabad
April 26, 2024 14: 11 PM
Slider అనంతపురం

మఠాలను కూడా వదలని వైసీపీ ముఠాలు

#miningmafia

వైసీపీ ముఠాలు సాధుసన్యాసుల మఠాలను కూడా వదలడం లేదు. అనంతపురం జిల్లా హోస్‌పేట లోని శ్రీ విజయ మహాలక్ష్మి పీఠం ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. శ్రీ విజయ మహాలక్ష్మి పీఠం హోస్‌పేట పీఠాధిపతి శివనారాయణ ఈ మేరకు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అనుచరులపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

శ్రీ విజయ మహాలక్ష్మి పీఠం హోస్‌పేట పీఠానికి 4 హెక్టార్ల భూమి ఉంది. అందులో మైనింగ్ చేస్తుంటారు. మైనింగ్‌ ఆదాయాన్ని పీఠం అభివృద్ధికి ఖర్చు చేస్తుంటారు. అయితే ఈ భూమిని తమకు ఇచ్చేయాలని వైసీపీ నేతలు వత్తిడి తీసుకువస్తున్నారని శివనారాయణ తెలిపారు. మైనింగ్‌ భూమిని వదిలేసి వెళ్లాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆయన వివరించారు. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. ఎమ్మెల్యే కాపు అనుచరులు తమను బెదిరిస్తున్నారని జిల్లా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నడంతో పోలీసులు ఏం చేస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు.

Related posts

రేపు గవర్నర్ తో భేటీ కానున్న సిఎం జగన్

Satyam NEWS

సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు హైకోర్టు ఆదేశాలు

Satyam NEWS

కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీని గెలిపించండి

Satyam NEWS

Leave a Comment