గుంటూరు జిల్లా నరసరాపుపేట సమీపంలో అత్యంత వైభవంగా జరిగే కోటప్పకొండ ఉత్సవాల్లో పోలీసులు, అధికారుల మధ్య వివాదం చెలరేగింది. పోలీసులే ఉత్సవాలు చేసుకోండి అని ఈవో అలిగి వెళ్ళిపోయారు. బారికేడ్ల విషయంలో పోలీసుల తీరును ఈవో శివకోటిరెడ్డి తప్పుబట్టారు. పిడుగురాళ్ల సీఐ సురేంద్ర కుమార్ తీరుపై ఈవో అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు తమ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతే ఇక తామెందుకు అని ఆయన ప్రశ్నించారు. ఉత్సవాలు పోలీసులే చేసుకోవాలంటూ ఈవో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
previous post