తెలంగాణ ఐటి, మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ చికెన్ తిన్నారు. ఇందులో వార్తేముంది అనుకుంటున్నారా? ఇది కచ్చితంగా వార్తే. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో చికెన్ అండ్ ఎగ్ మేలా ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో చికెన్, ఎగ్ అమ్మకాలు తగ్గిపోయిన నేపథ్యంలో కరోనా వైరస్ కు చికెన్ కు సంబంధం లేదని రుజువు చేయడానికి కొందరు టీఆర్ఎస్ నాయకులతో కలసి ఆయన చికెన్ ఆరగించారు.
ఆ సమయంలో తీసిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చికెన్ వినియోగంతో కరోనా వైరస్ సోకుతోందంటూ సాగుతున్న ప్రచారం చూసిన కెటిఆర్ ఆటువంటి ప్రచారానికి చెక్ చెప్పేందుకు ఇలా చికెన్ తింటూ ఫోటోలు దిగి పోస్టు చేశారు. అదీ సంగతి.