భీమా క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నీ క్రికెట్ టీం సభ్యులకు మినిస్టర్ క్వార్టర్స్ లో రాష్ట్ర రోడ్లు-భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం స్పోర్ట్స్ డ్రెస్,బ్యాట్లు సంబంధిత కిట్ పంపిణీ చేశారు. క్రికెట్ లో మరింతగా రాణించాలని వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఇంటర్ లో(ఎంపిసి,బైపిసి) అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన శ్రీ అమృత జూనియర్ కాలేజి, యూనిక్ అకాడెమీ కి చెందిన విద్యార్థిని,విద్యార్థులను మంత్రి వేముల అభినందించారు. వారికి మెమెంటో అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్ ఉన్నత చదువులో ఇంతే పట్టుదలతో రాణించాలని మంత్రి కాంక్షించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజి ఈసి సభ్యుడు బస్వరాజ్,శంకర్,కాలేజి యాజమాన్యం,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.