బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ సునిల్ బన్సల్ తెలంగాణకు రానున్నారు. పార్టీ సంస్థాగత అంశాలపై రాష్ట్ర నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. రెండ్రోజుల పాటు ఆయన ఈ వ్యవహారాలలోనే బిజీగా గడపనున్నారు. ఇక్కడే ఉండి పార్టీ పరిస్థితులను చక్కదిద్దనున్నారు.
కొద్దిరోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలకు చెక్ పెట్టేందుకే ఈ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నేతల మధ్య సమన్వయం కొనసాగించేలా దిశానిర్దేశం చేయనున్నారు.
త్వరలో తెలంగాణలో జరగబోయే ఎన్నికల సంసిద్ధతపైనా ఆయన చర్చించనున్నారు. ఎలాంటి వ్యూహాలతో వెళ్తే బాగుంటుందనే అంశాలపై నేతలతో చర్చించనున్నారు. ఇదిలా ఉండగా పార్టీ రాష్ట్ర నాయకత్వం మార్పు అంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఈ సమీక్ష ప్రాధాన్యతను సంతరించుకుంది. పైకి పార్టీ సంస్థాగత వ్యవహారాలపై సమీక్ష అని చెప్పినా.. అసంతృప్త నేతలను బుజ్జగించే ప్రక్రియ సైతం ఉంటుందని తెలుస్తోంది.