29.7 C
Hyderabad
May 1, 2024 03: 40 AM
Slider ప్రకాశం

మంత్రి ఆదిమూలపు సురేశ్ పై భూ కబ్జా ఆరోపణ

aadimulapu sures

ప్రకాశం జిల్లా దర్శిలో నేడు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్ పై ఒక మహిళ భూకబ్జా ఫిర్యాదు చేశారు. మంత్రి సురేశ్ తమ పొలం ఆక్రమించారని మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్కాపురం మండలం దరిమడుగుకు చెందిన రంగలక్ష్మమ్మ ఈ ఫిర్యాదును నేరుగా ప్రకాశం జిల్లా కలెక్టర్‌ దినేశ్‌ కుమార్‌ కు అందచేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేణుగోపాల్‌ కూడా పాల్గొన్నారు. మంత్రికి చెందిన జార్జ్‌ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో తమకు మూడెకరాల భూమి ఉందని, ఆ పొలాన్ని మంత్రి సురేశ్‌ ఆక్రమించారని ఆమె వెల్లడించారు. ఎంతమందికి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆమె అన్నారు. ‘‘మీరైనా న్యాయం చేయండి” అని కలెక్టర్‌కు ఆ మహిళ విన్నవించారు.

Related posts

మహాశివరాత్రి కి ఆర్టీసీ ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS

మారుమూల ప్రాంతాల్లో పర్యటించిన ఆసిఫాబాద్ ఎస్పీ

Satyam NEWS

ఆసుపత్రికి తీసుకెళ్లమంటే కిడ్నీ అమ్మేశాడు

Murali Krishna

Leave a Comment