ప్రకాశం జిల్లా దర్శిలో నేడు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్ పై ఒక మహిళ భూకబ్జా ఫిర్యాదు చేశారు. మంత్రి సురేశ్ తమ పొలం ఆక్రమించారని మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్కాపురం మండలం దరిమడుగుకు చెందిన రంగలక్ష్మమ్మ ఈ ఫిర్యాదును నేరుగా ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ కు అందచేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. మంత్రికి చెందిన జార్జ్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో తమకు మూడెకరాల భూమి ఉందని, ఆ పొలాన్ని మంత్రి సురేశ్ ఆక్రమించారని ఆమె వెల్లడించారు. ఎంతమందికి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆమె అన్నారు. ‘‘మీరైనా న్యాయం చేయండి” అని కలెక్టర్కు ఆ మహిళ విన్నవించారు.