40.2 C
Hyderabad
April 28, 2024 16: 32 PM
Slider మహబూబ్ నగర్

బండి సంజయ్ అక్రమ అరెస్టుకు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

#Bharatiya Janata Party

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్టును నిరసిస్తూ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ముందుకు వెళ్తున్న బండి సంజయ్ పై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అర్థరాత్రి అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నియంతలా వ్యవరిస్తూ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి తాను వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తూ రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ప్రశ్నించే నాయకుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఇకనైనా ప్రభుత్వం తమ తీరు మార్చుకోకపోతే ప్రజల నుంచి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అనంతరం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని జిల్లా ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం కృష్ణారెడ్డి, జిల్లా నాయకులు రామాంజనేయులు, బండల వెంకట్రాములు, వెంకటేశ్వర్ రెడ్డి, నరసింహ, కౌన్సిలర్ రజక జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Related posts

విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల సమన్వయం అవసరం

Sub Editor

శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అందరూ హాజరుకండి

Satyam NEWS

విద్యార్థుల ముందే డీఈఓ ను కడిగిపారేసిన ప్రవీణ్ ప్రకాష్

Satyam NEWS

Leave a Comment