భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొమ్మిది మంది తహసీల్దారులను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ అనుదీప్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా తక్షణమే వారి స్థానాల్లో బాధ్యతలు స్వీకరించి కలెక్టరేట్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈ బదిలీల్లో భాగంగా జూలూరుపాడు మండల తహసీల్దార్ గా గత 15 నెలలుగా పని చేస్తున్న లూథర్ విల్సన్ అశ్వారావుపేటకు బదిలీ అయ్యారు. కొత్తగూడెం కలెక్టరేట్ లో ఈ సెక్షన్ లో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఆర్ శారదను జూలూరుపాడు తహసీల్దారుగా నియమించారు
previous post
next post