సికే దీన్నే మండలం రామరాజు పల్లే పరిధిలోని బృందావనం వెంచర్స్ లో తమ కి చెందిన ఫ్లాట్ లను వైసీపీ నేతలు అక్రమించారని కడపలో వల్లూరు మండలం పెద్ద పుత్త గ్రామనికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ గృహ సారధి పి.ఈశ్వర్ రెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు.
డిప్యూటీ సీఎం అంజద్ బాష, ఆయన సోదరుడు అహ్మద్ బాష అండ చూసుకుని మైనార్టీ నేత సుబాన్ బాష ఆక్రమణ చేశారని తెలిపారు. ఫ్లాట్ నంబర్లు 298, 252, 312, 273,245,303,275,274 లలో మొత్తం 0.38 ఎకరాల కబ్జా చేశారని తెలిపారు. నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆయన ఆరోపించారు. నా వెనుకాల వైసీపీ పెద్దలు ఉన్నారు ఎం చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరింపులు చేస్తున్నారని ఆయన అన్నారు. పోలీసుల దగ్గరకు వెళ్లినా తిరిగి మాపైనే ఫిర్యాదులు ఉన్నాయంటూ వెనక్కు పంపారని బాధితుడు అంటున్నాడు. వైఎస్ బ్రతికి ఉన్నప్పటి నుండి వారి వెంటనే నడిచాము..చివరకు తమ భూములే వైసీపి నేతలు అక్రమించడం ఎంత వరకు సమంజసం అంటూ ప్రశ్నిస్తున్నాడు.
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా కూడా తమకు న్యాయం జరగడం లేదు.. సమగ్రంగా విచారించి న్యాయం చేయాలని బాధితుడు ఈశ్వర్ రెడ్డి కోరారు.