38.2 C
Hyderabad
April 29, 2024 12: 12 PM
Slider ఖమ్మం

పాలేరు నుంచే పోటీ చేస్తా.. :వైఎస్ షర్మిల

#yssharmila

పాలేరు నుంచే నేను పోటీ చేస్తానని వైఎస్‌ ష‌ర్మిల ప్రకటించారు. వైఎస్సార్‌ జయంతిని పురస్కరించుకొని నిన్న ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకొని, అక్కడి నుండి పాలేరుకు వెళ్లారు. పాలేరులో షర్మిల మాట్లాడుతూ.. త్వరలో పాలేరులో పాదయాత్రను ప్రారంభించి, ఇక్కడే ముగిస్తానని చెప్పారు. రైతులకు అండగా నిలబడతానని, ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టిస్తానని, పేద బిడ్డల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీలతో దివంగత ముఖ్యమంత్రి పాలనను తీసుకు వస్తానని చెప్పారు. నేను మళ్లీ చెబుతున్నా.. రాజశేఖరరెడ్డి బిడ్డను.. పులి కడుపున పులే పుడుతుంది.. మీ బిడ్డగా మీకు నమ్మకంగా సేవ చేస్తానన్నారు. రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలన ప్రతి గడపకు చేరుస్తానని మాట ఇస్తున్నానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,800 కిలో మీటర్లు పాదయాత్ర చేశానని షర్మిల తెలిపారు.

Related posts

ప్రయివేటు కాలేజీ ఫీజుల జీవో కొట్టివేత

Satyam NEWS

టీడీపీ నుంచి పోటీకి అనుమతివ్వాల్సింది చంద్రబాబే

Bhavani

పులివెందులలో జగన్ ఓడిపోతే పార్టీ పరిస్థితి ఏమిటో?!

Satyam NEWS

Leave a Comment