కూకట్ పల్లి నియోజకవర్గం, బాలాజీ నగర్ డివిజన్ ఐడిఎల్ చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను బిజెపి నాయకులు పర్యవేక్షించారు. తెలంగాణ విమోచన స్వతంత్ర పోరాటంలో వీరమరణం పొందిన కొమరం భీం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, షోయబుల్లాఖాన్ లాంటి పెద్దల విగ్రహాలను చెరువు కట్టపై ప్రతిష్టించాలని ఈ సందర్భంగా బిజెపి నాయకులు కోరారు.
దళిత,పీడిత , బడుగు, బలహీన వర్గాల కొరకు కృషిచేసిన మహనీయుల విగ్రహాలు, తెలంగాణ అమరవీరుల స్తూపం, కూకట్ పల్లి అమరవీరుడు రాజా రెడ్డి విగ్రహం,భారతదేశ స్వతంత్ర సమరయోధుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేయాలని బిజెపి నేతలు కోరారు. అదే విధంగా కూకట్ పల్లి ప్రాంతంలో ఎన్నో సేవలు అందించిన మాజీ మంత్రి ఎం. రామచందర్ రావు, మాజీ మంత్రి పి. జనార్దన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జి. రామచంద్ర రావు ముదిరాజ్, సంఘ సేవకులు, అలయ ధర్మకర్త వడ్డేపల్లి నర్సింగ్ రావు, మాధవరం సుదర్శన్ రావు విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాలని కోరారు.
చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, చెరువు వద్ద ఫుడ్ కోర్ట్ కాంప్లెక్స్ నిర్మాణము చేసి స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బిజెపి అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి, నారాయణపేట జిల్లా ఇన్చార్జ్ మాధవరం కాంతారావు, బిజెపి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు, కార్పొరేటర్ మహేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సూర్యరావు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.