అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో తెల్లరాకముందే టీ దొరుకుతుందో లేదో తెలియదు కానీ మద్యం మాత్రం బస్టాండ్ అతి సమీపంలో రోడ్డులో పేరం బార్ అండ్ రెస్టారెంట్ మరియు మదనపల్లి రోడ్ లోగల నాని బార్ అండ్ రెస్టారెంట్ విచ్చలవిడిగా మద్యం దొరుకుతుండడం విశేషం. మద్యం కు బానిసైన వారిని లక్ష్యంగా చేసుకొని మద్యం అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు ఇక్కడి బార్ యజమానులు. మెయిన్ రోడ్ల సమీపంలో మద్యం విక్రయాలు జరుగుతున్న తంతును ఎక్సైజ్ మరియు ఎస్ ఈ బి అధికారులు చోద్యం చూస్తున్నారు. మామూలు మత్తులో ఎక్సైజ్ మరియు ఎస్ ఈ బి అధికారులు ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారు.
previous post