జగన్ ప్రభుత్వం… నవరత్నాలలో భాగంగా అర్హులైన పేదలందరికీ ఇండ్లు మంజూరు చేస్తోందని చెప్పిన తరుణంలో…. మరి అర్హులైన 256 మంది సంగతేంటని టీడీపీ ప్రశ్నించింది. ఈ మేరకు కలెక్టరేట్ జరిగిన “స్పందన”కు…సోనియా నగర్ ,సారిపల్లి వద్ద గత ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన టిడ్కో ఇండ్లలో…256 మంది ని అన్హరులంటూ ప్రస్తుత జగన్ ప్రభుత్వం తొలగించడం దారుమణని టీడీపీ నేతలు కనకర మురళీ మోహన్ ,ఐవీపీ రాజు ,ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్ తదితరులు కలెక్టరేట్ స్పందనలో లబ్దిదారులతో కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం వెలుపల మీడియా తో మాట్లాడారు.
సదరు 256 మంది లబ్ధిదారులకు ప్రధాన మంత్రి ఆవాజ్ యోజనలో పేర్లు ఉండగా… ఈ జగన్ ప్రభుత్వం ఎలా తొలగిస్తుందని టీడీపీ ప్రశ్నించింది. ఇటీవల తమ పార్టీ నిర్వహించిన బస్ యాత్ర లో మా పార్టీ జోనల్ ఇంచార్జ్, కేంద్ర మాజీమంత్రి అశోక్ ల వద్ద..సోనియా నగర్ లో బాధితులంతా మొరపెట్టుకున్నారని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా సదరు లబ్ధిదారులందరూ..స్పందనకు వచ్చి ఫిర్యాదు చేసొరని చెప్పారు. స్వయంగా వాళ్లే… తమకు ఇండ్లు నిర్మించలేదని,.మమ్మల్ని అన్యాయం జగన్ ప్రభుత్వం తొలగించందని బాధితులు సైతం విలేకరుల కు తమ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే… తొలగించబడ్డ..256 మంది బాధితులకు ఇండ్లు నిర్మించే బాధ్యత ప్రభుత్వ మే తీసుకోవాలని.. టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.