28.7 C
Hyderabad
April 28, 2024 06: 40 AM
Slider ఆదిలాబాద్

మహారాష్ట్ర నుండి ద్విచక్రవాహనంపై తరలిస్తున్న దేశిదారు పట్టివేత

#adilabad police

మహారాష్ట్ర నుండి ద్విచక్రవాహనంపై అక్రమంగా తరలిస్తున్న 96 దేశి దారు బాటిళ్లను, స్వాధీనం చేసుకున్నట్లు తాంసీ ఎస్ఐ జి. శిరీష పేర్కొన్నారు.

బుధవారం మధ్యాహ్నం తలమడుగు మండలం శేరుగుడా గ్రామానికి చెందిన నిందితుడు సిడం ప్రకాష్ (27) AP 01AJ 0216 నెంబరు గల ద్విచక్రవాహనంపై మహారాష్ట్ర నుండి 96 దేశి దారు బాటిళ్లు అక్రమ మార్గంలో తరలిస్తున్నట్లు స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ ఆర్ గణపత్, కానిస్టేబుల్ కే. దశరత్ లు అందించిన సమాచారం మేరకు తాంసీ మండలంలోని అట్నంగూడ రహదారిపై మాటు వేసి పట్టుకున్నట్లు తెలిపారు.

అతని వద్ద నుండి దేశదారు బాటిళ్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు వివరించారు, ఈ దాడుల్లో డయల్-100 కానిస్టేబుల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

కీర్తీ సురేష్ ఇప్పుడు మిస్ ఇండియా

Satyam NEWS

కష్టాల కడలిలో మునిగిపోయిన సుబ్బరామిరెడ్డి కంపెనీ

Satyam NEWS

బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా కార్యాలయం ప్రారంభం

Bhavani

Leave a Comment