28.7 C
Hyderabad
April 26, 2024 08: 41 AM
Slider కడప

రోడ్డుపైకి రావద్దు అంటే అడ్డగోలుగా తిరుగుతున్న జనాలు

rajmpet 1

కడప జిల్లా రాజంపేట పట్టణంలో మంగళవారం కరోనా లాక్ డౌన్ మూలంగా 144 సెక్షన్ అమల్లో ఉన్నా పట్టించుకోకుండా ప్రజలు ఇళ్ల ను వదిలి తిరుగుతున్నారు. ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు పోలీసులు, అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా లెక్క చేయకుండా, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి అంతటా వాహనాలతో రోడ్ల పైకి వచ్చి ప్రజలు తిరుగుతున్నారు.

పట్టణంలో యథేచ్ఛగా తోపుడు బండ్లు తిరుగుతుండగా, వాణిజ్య సముదాయాలు కూడా తెరుచుకుంటున్నాయి. పోలీసులు రోడ్లకు అడ్డంగా స్టాపర్స్ ఏర్పాటు చేస్తున్నా, లెక్క చేయకుండా ద్విచక్ర వాహనాలపై జోరుగా యువత షికారు చేస్తున్నారు. పోలీసులు ఎన్ని సార్లు మైకుల ద్వారా, మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా జనాలు ఏదో ఒక వంకతో బయట తిరుగుతున్నారు.

ప్రజలు స్వచ్చందంగా సహకరిస్తే తప్ప ఎన్ని కర్ఫ్యూ లు పెట్టినా ఫలితం శూన్యం. కరోనా మహమ్మారి జనాలు గుమ్మి కుడితే వస్తుందని తెలిసినా ,జనాలు ఇండ్లు వదిలి రావద్దని చెప్పినా లెక్క చేయకుండా బయటకు రావడంతో అధికారులు, పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

Related posts

పోలీస్ కిష్టన్న వర్దంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Bhavani

ప్ర‌జా స‌మ‌స్య‌లకు అత్యున్న‌త‌ స్థాయిలో ప‌రిష్కారం

Satyam NEWS

కపలవాయి విజయ కుమార్ కు ప్రతిష్టాత్మక GJC అవార్డు

Satyam NEWS

Leave a Comment