కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో నాగ్ పూర్ నగరంలో లాక్ డౌన్ విధించారు. 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకూ లాక్ డౌన్ అమలులో ఉంటుంది.
అయితే ఈ కాలంలో అత్యవసర సర్వీసులకు మినహాయింపు ప్రకటించారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్నాటక, గుజరాత్ తమిళనాడు రాష్ట్రాలలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో 85.91 శాతం కేసులు ఈ ఆరు రాష్ట్రాల నుంచే ఉన్నాయి.
దేశం మొత్తంలో నమోదైన కరోనా కొత్త కేసుల్లో దాదాపు 60 శాతం కేసులు ఒక్క మహారాష్ట్ర నుంచి మాత్రమే నమోదు అయ్యాయి.