వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ పట్టువస్త్రాలు సమర్పించారు.
వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సమేతంగా మంత్రి అల్లోల స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేదపండితులు ఆశీర్వచనాలను అందించారు.
శివరాత్రి మహోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వామి వారి దివేనతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కలెక్టర్ కృష్ణభాస్కర్, ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్, తదితరులు ఉన్నారు.