గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని 13 వ వార్డు మైనారిటీ సెల్ నాయకులు షేక్ బాబు కుమారుడు మస్తాన్-కరిష్మాల వివాహం సోమవారం జరిగింది.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పెళ్లి కానుక పంపగా, పార్టీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు సోమవారం వివాహ వేడుకకు హాజరై వధూ వరులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, భాస్కర్, మైనారిటీ నాయకులు షేక్ హుస్సేన్, అబ్దుల్ మజీద్, కొత్తపేట హుస్సేన్, షేక్ సుభాని పాల్గొన్నారు.