అదను చూసి దెబ్బకొట్టడంలో చంద్రబాబును మించిపోతున్నారు యువ నేత నారా లోకేశ్. యువగళం పాదయాత్ర తర్వాత రాటుదేలిన రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ సీనియర్లను సైతం విస్మయానికి గురి చేస్తున్నారు. పార్టీ బాధ్యతలను మోస్తుండటంతో రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఢిల్లీలో మకాం వేసిన లోకేశ్ తమ ఇమేజ్ పెంచుకోవటానికి సర్వశక్తులూ ధారపోస్తున్నారనటం ఏ మాత్రం సందేహం లేదు.
ప్రత్యర్థులతో సై అంటే సై అనే స్థాయిని దాటేసిన లోకేశ్ తో వ్యవహారం ఇంతకు ముందులా ఉండదని ప్రూవ్ చేశాడు. తన తండ్రి చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయన్ను అక్రమ అరెస్ట్ నుంచి కాపాడేందుకు శతవిధాల ప్రయత్నిస్తూ ఢిల్లీలో మకాం వేసిన లోకేశ్, సోమవారం ఒక రోజు నిరసన దీక్షలో పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అరెస్టుపై మోసపూరిత కథనాలు నడుపుతున్న టీవీ9, ఎన్టీవీలపై లోకేష్ విరుచుకుపడ్డారు.
అధికార వైసీపీకి అండగా నిలుస్తూ, టీడీపీలో లేనిపోని సంక్షోభాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న టీవీ9, ఎన్టీవీ మైక్ లను మిగతా చానెళ్ల మైక్ లను పక్కన బెట్టి మరీ ముందుకు పెట్టారు. ఆయా చానెళ్ల రిపోర్టర్లపై సెటైర్లు వేశారు. చంద్రబాబు అరెస్ట్పై కల్పిత కథనాలతో వైసీపీ అనుకూల వైఖరిని ఆ రెండు చానెళ్లూ అవలంబిస్తున్నాయి. దీంతో లోకేశ్ ఆ రెండు చానెళ్లను తన దైన శైలిలో ట్రోల్చేసి విమర్శించి హైలైట్ అయ్యారు.