28.7 C
Hyderabad
April 26, 2024 09: 34 AM
Slider నిజామాబాద్

ప్రేమించానన్నాడు…పెళ్లాడతానన్నాడు…పురుగుల మందు తాగాడు

sucide

పాపం అతడు ఆ అమ్మాయిని ఎంతగా ప్రేమించాడో ముందుగా తెలియలేదు. వేరే కులం కూడా కాదు. అమ్మాయిదీ అబ్బాయిదీ ఒకే కులం. మరి ఆ  అమ్మాయి పెద్దలు ఎందుకు ఒప్పుకోలేదో తెలియదు కానీ ఇప్పుడు ఆ భగ్న ప్రేమికుడు విగతజీవుడయ్యాడు.

నిజామాబాద్ జిల్లా గాంధారి మండలం గండివేట్ గ్రామానికి చెందిన ఒక లైలా దీనగాధ ఇది. పిట్ల మురళి (25) గత కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన వారి కులానికి చెందిన అమ్మాయినే ప్రేమిస్తున్నాడు. అయితే అమ్మాయి తల్లితండ్రులు వీరి ప్రేమను ఒప్పుకోవడం లేదు.

గత వారం రోజులుగా మనస్థాపానికి గురై ఉన్నాడు మురళి. తన ప్రేమ విఫల‌మైందని భావించి సోమవారం రాత్రి 8 గంటల‌ సమయంలో పురుగుల‌ మందు తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎస్‌ఐ తెలిపారు. రాత్రికి ఇంటికి వచ్చి వాంతులు చేసుకోవడంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మురళిని బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాదుకు తీసుకువెళ్లారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 8 :30 గంటల‌కు చనిపోయాడని వారు తెలిపారు. అక్కడి నుండి పోస్టుమార్టం నిమిత్తం తిరిగి బాన్సువాడ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు.

Related posts

సింహాచలంపై సీఎం జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేసిన హైకోర్టు

Satyam NEWS

రైల్వే కోడూరు వైసీపీ లో భగ్గు మన్న నిరసన

Satyam NEWS

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీవీ చానల్‌ పేరుతో మోసం

Satyam NEWS

Leave a Comment