వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు కేసు మరో మలుపు తిరిగింది. రఘురామ కుటుంబసభ్యులు చేసిన ఫిర్యాదుపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు.
వారి ఫిర్యాదును సభాహక్కుల కమిటీకి పంపారు. ఈ విధంగా లోక్ సభ స్పీకర్ చేయడంతో కేసు మరో మలుపు తిరిగినట్లయింది.
రఘురామ అంశంపై వెంటనే నివేదిక ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం కేంద్ర హోంశాఖను కోరింది. ఈ మేరకు రఘురామ కుటుంబీకుల ఫిర్యాదు కాపీని హోంశాఖకు పంపారు.