మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కరోనా సోకింది. ఆయనకు కరోనా పాజిటీవ్ వచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కరోనా పాజిటీవ్ రావడంతో ఆయన ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఆయన కుటుంబ సభ్యులకు, ఇంటిలోని సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
దేశంలో ఒక ముఖ్యమంత్రికి కరోనా పాజిటీవ్ రావడం ఇదే ప్రధమం. అంతకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కరోనా వచ్చినట్లు అనుకున్నారు కానీ ఆ తర్వాత ఆయనకు కరోనా సోకలేదని కేవలం జ్వరంతోనే బాధపడ్డారని తేలింది.