హైదరాబాద్ లోని రామంతపూర్ లో మాజీ కార్పొరేటర్ గంథం జొత్సా నాగేశ్వరరావు అధ్వర్యంలో స్వగృహం నందు అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. అయ్యప్ప స్వామి నామ స్మరణ లో పలువురు అయ్యప్ప భక్తులు కీర్తనలు పడుతూ వైభంగా మహపడిపూజ నిర్వహించారు. పూజా కార్యక్రమంలో నగర మాజీ మేయర్ బొంతు రాంమోహన్, చర్ల పల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవీ, చిలుకా నగర్ కార్పోరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్, ఉప్పల శ్రీనివాస్ గుప్తా (టీ.ఎస్.టి.డి.సి) ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్థన్ రెడ్డి రెడ్డి,ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మా రెడ్డి, మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజన్న, చిల్కానగర్ మాజీ కార్పొరేటర్ సరస్వతి సదానంద్, లతో పాటు ఉప్పల్ నియోజకవర్గ తెరాస నాయకులు అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి