ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు బిజెపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా ఈ నెల పదహారు న హైదరాబాద్ లోని ధర్నా చౌక్ లో మహా ధర్నా ను నిర్వహిస్తున్నట్లు ఓబీసీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నాగ్నాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రిజర్వేషన్ల వ్యతిరేక విధానాన్ని ఎండగడుతూ ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. జాతీయ కాంగ్రెస్ ఓబిసి నాయకులు ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి నాయకత్వంలో ఈ మహా ధర్నా ఉంటుందని నాగ్నాధ్ తెలిపారు. కావున జిల్లాలోని అన్ని మండలాల నాయకులు భారీ సంఖ్యలో హాజరై ఈ ధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయనతో పాటు ఓబిసి జిల్లా బాధ్యులు సాయి పటేల్ ఉన్నారు.
previous post