29.7 C
Hyderabad
April 29, 2024 07: 45 AM
Slider నిజామాబాద్

కాన్పిరసీ: రిజర్వేషన్ల రద్దు కుట్రలను అడ్డుకుందాం

dharna chowk

ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు బిజెపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా ఈ నెల పదహారు న హైదరాబాద్ లోని ధర్నా చౌక్ లో మహా ధర్నా ను నిర్వహిస్తున్నట్లు ఓబీసీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నాగ్నాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రిజర్వేషన్ల వ్యతిరేక విధానాన్ని ఎండగడుతూ ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. జాతీయ కాంగ్రెస్ ఓబిసి నాయకులు ప్రొఫెసర్  కత్తి వెంకటస్వామి నాయకత్వంలో ఈ మహా ధర్నా  ఉంటుందని నాగ్నాధ్ తెలిపారు. కావున జిల్లాలోని అన్ని మండలాల నాయకులు భారీ సంఖ్యలో హాజరై ఈ ధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయనతో పాటు ఓబిసి జిల్లా బాధ్యులు సాయి పటేల్ ఉన్నారు.

Related posts

ఎమ్మెల్సీ ఎన్నికలకు గ్రాడ్యుయేట్లు ఓటు నమోదు చేసుకోవాలి

Satyam NEWS

నేస్తం, కల్వకుంట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్ బుక్స్, పెన్నుల పంపిణీ

Satyam NEWS

రామ‌తీర్ధం..నెల్లిమ‌ర్ల వాట‌ర్ వ‌ర్క్స్ ప‌రిశీలించిన విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల‌

Satyam NEWS

Leave a Comment