36.2 C
Hyderabad
April 27, 2024 22: 05 PM
Slider నల్గొండ

ఎమ్మెల్సీ ఎన్నికలకు గ్రాడ్యుయేట్లు ఓటు నమోదు చేసుకోవాలి

#CongressLeader

త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని హుజూర్ నగర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్ అన్నారు.

ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బూరుగడ్డ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరున్నర సంవత్సరాలు గడిచినా ఎటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయకుండా జాప్యం చేయడంతో పాటు నిరుద్యోగులకు భృతి కూడా ఇవ్వకుండా మభ్యపెడుతుందని అన్నారు.

టిఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలంటే ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు 2017 వ, సంవత్సరం కంటే ముందు డిగ్రీ ,ఇంజనీరింగ్ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లు తమ ఓటు నమోదు చేసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఈ సమావేశంలో పిఎసిఎస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, వీరయ్య, బిక్షం, సైదులు,నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

గాడ్ ఇన్ లాక్ డౌన్: ఒంటిమిట్ట లో రథోత్సవ పూజలు

Satyam NEWS

ఘనంగా లంబాడీల ఆరాధ్యదైవం శీతల పండుగ

Satyam NEWS

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీనే

Bhavani

Leave a Comment