సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు మండల కేంద్రంలో పి.వి రావు మాల మహానాడు సూర్యాపేట జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సాలే రామారావు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో మేళ్లచెరువు మండలానికి చెందిన ఎర్ర గోపయ్యను మేళ్లచెరువు మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నియామక పత్రాన్ని పి.వి రావు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మి మల్ల నరసింహారావు అందజేశారు.
ఈ సందర్భంగా మల్ల నరసింహారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కోటేశ్వరావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు ఏ రాజకీయ పార్టీ మద్దతు ఇచ్చినా రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీలకు మాలలు అందరూ కలిసి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా మహిళా అధ్యక్షురాలు అంతోటి జ్యోతి, హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షురాలు శీలం స్వరూప తదితరులు పాల్గొన్నారు.