36.2 C
Hyderabad
April 27, 2024 22: 19 PM
Slider నల్గొండ

పి.వి రావు మాల మహానాడు అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం

#Malamahanadu

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు మండల కేంద్రంలో పి.వి రావు మాల మహానాడు సూర్యాపేట జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సాలే రామారావు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో మేళ్లచెరువు మండలానికి చెందిన ఎర్ర గోపయ్యను మేళ్లచెరువు మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నియామక పత్రాన్ని పి.వి రావు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మి మల్ల నరసింహారావు  అందజేశారు.

ఈ సందర్భంగా మల్ల నరసింహారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కోటేశ్వరావు  మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు ఏ రాజకీయ పార్టీ మద్దతు ఇచ్చినా రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీలకు  మాలలు అందరూ కలిసి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా మహిళా అధ్యక్షురాలు అంతోటి జ్యోతి, హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షురాలు శీలం స్వరూప తదితరులు పాల్గొన్నారు.

Related posts

జాతీయ పంచాయతీ అవార్డులకు ప్రతిపాదనలు

Murali Krishna

బీజేపీకి దగ్గరయ్యేందుకే కమ్యూనిస్టులకు దూరం

Bhavani

అమరవీరులకు పోచారం భాస్కర్ రెడ్డి ఘన నివాళి

Satyam NEWS

Leave a Comment