కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మలివిడతకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన గాంధీ జన్మస్థలం పోరుబందర్ నుండి ప్రారంభించబోతున్నట్లు సమాచారం.
తొలి విడతలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కొనసాగిన భారత్ జోడో యాత్ర రెండో విడత పశ్చిమాన గుజరాత్ రాష్ట్రంలో ప్రారంభమైన తూర్పున త్రిపురలోని అగర్తలలో యాత్ర ముగించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.సెకండ్ ఫేజ్ యాత్రను అధిక భాగం యూపీలో సాగేలా ప్రణాళిక రచిస్తున్నారు.ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా రాహుల్ గాంధీ మరోసారి ప్రజల మధ్యలోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.
రెండో విడత భారత్ జోడో యాత్ర గుజరాత్ నుండి త్రిపుర వరకు సాగే విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కామెంట్స్ చేసినా ప్రారంభం తేదీని సస్పెన్స్ లో పెట్టారు. దీంతో సెప్టెంబర్, లేదా అక్టోబర్ లో ప్రారంభం అవుతుందనే భిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. తాజాగా 2.0 ప్రారంభ తేదీపై పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రారంభించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.