ములుగు జిల్లా మల్లంపల్లి మండల సాధన సమితి రిలే నిరాహార దీక్ష 9వ రోజుకు చేరింది. దీక్షలకు మద్దతుగా నేడు బేడ బుడగ జంగాల సంఘం, బుడుబుక్కల సంఘం వారు కలిసి ఉమ్మడిగా మద్దతునిచ్చారు. ఆయా సంఘాల ప్రతినిధులు కూడా రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సాధన సమితి అధ్యక్షుడు గోల్కొండ రాజు మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులు ఇన్ని సంవత్సరాలు ప్రజలను మభ్య పెట్టారని ఎద్దేవా చేశారు. ఇకనైనా స్థానిక ప్రజాప్రతినిధులు మండలం పేరు చెప్పుకొని రాజకీయం చేసిన వారంతా తమ పదవులకు రాజీనామా నైనా చేయాలి లేకపోతే త మ తోపాటు ఉద్యమం చేయాలని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బేడ బుడగ జంగం సంఘం అధ్యక్షుడు తూర్పాటి సమ్మయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి హామీ మేరకు మండలాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని భవిష్యత్తు ఉద్యమ కార్యక్రమాలకు బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
బుడుబుక్కల సంఘం అధ్యక్షుడు నాయకుల ప్రభాకర్ మాట్లాడుతూ మల్లంపల్లి మండల సాధన సమితి ఆరు ఏడుగురు మందితో ప్రారంభమైనప్పుడు చాలామంది చూసి నవ్వారని సాధన సమితి ఉద్యమ స్ఫూర్తి కి మండలం కోసం కొట్లాడ్డానికి వందలు వేలుగా తయారయ్యారని ఇకనైనా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో చిల్ల సమ్మయ్య తూర్పాటి ఐలయ్య శ్రీను జిల్లా జంపయ్య కుమార్ చిల్ల రాజు చిల్ల డేవిడ్ కిషోర్ శేఖర్ రమేష్ శ్రీను భూపతి వెంకన్న భూపతి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.