కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని.. విజయనగరం యూత్ ఫౌండేషన్ ప్రతినిధులు కలిశారు. ఇటీవల కరోనా సమయంలో పలు సేవా కార్యక్రమాలు చేసిన విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. విజయనగరం యూత్ ఫౌండేషన్ ను అభినందించారు. ఈ మేరకు ఏపీలోని విశాఖ పట్నం వచ్చిన కేంద్ర మంత్రి ని విజయనగరం యూత్ ఫౌండేషన్ సభ్యులు షేక్ ఇల్తమాష్ ,అంబులెన్స్ శివతో పాటు అనిల్ ,అశోక్,అవంతి కంప్యూటర్స్ డైరెక్టర్ కోన ప్రకాష్ లు కలిశారు. దీంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి…యూత్ ఫౌండేషన్ సేవలను తెలుసుకుని మరిన్ని సేవాకార్యక్రమాలు చేస్తూ యువతకు స్పూర్తినివ్వాలని కోరారు. కరోనా కష్ఠకాలం లో అందించిన సేవలతో పాటు ఆకలితో ఆలమటిస్తున్న అన్నార్తులకు అను నిత్యం అన్నదానం చేస్తున్న విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరింతగా అభినందించారు. అలాగే యూత్ ఫౌండేషన్ ప్రతీ రోజూ దాదాపు 300 మందికి అహారపు ప్యాకెట్లు అందించిన విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మరిన్ని సేవాతత్పరత కనబరచాలని కోరారు.
previous post